29.7 C
Hyderabad
April 29, 2024 09: 01 AM
Slider విజయనగరం

ఓ హెచ్.సిని ప్రశంసించిన విశాఖ రేంజ్ డీఐజీ!

constable

విజయనగరం జిల్లా పార్వతీపురం టౌన్ పీఎస్ లో హెడ్ కాని స్టేబుల్ గా పనిచేస్తున్నకె.కృష్ణమూర్తిని విశాఖ రేంజ్ డీఐజీ రంగారావు ప్రశంసించారు. ప్రతీనెల తన జీతం నుండి కొంత మొత్తాన్నివృద్దుల‌కు, పేద‌ల‌కు వెచ్చిస్తూ, సేవలు అందిస్తున్నందుకుగాను విశాఖ రేంజ్ డీఐజీఎల్.కె.వి.రంగారావు శాలువతో సత్కరించి, ప్రశంసాపత్రాన్నిఅందించారు.

ఈ సందర్భంగా డీఐజీ ఎల్. కె.వి.రంగారావు మాట్లాడుతూ విజయనగరం జిల్లా, పార్వతీపురం టౌన్ పోలీసు స్టేషనులో
హెడ్ కాని స్టేబులుగా పనిచేస్తున్నకొమిరి కృష్ణమూర్తి ఏ పోలీసు స్టేషనులో పనిచేస్తున్నా, ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే తను పనిచేసే పోలీసు స్టేషను పరిధిలో ఉన్నవృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలను సందర్శించేవార‌న్నారు. ఆ స‌మ‌యంలోవృద్ధులకు, అనాధ పిల్లలకు ప్రతినెలా తన జీతములో10,000/-ల వరుకు వెచ్చించి, దుస్తులు వారి పిల్లలకు పుస్తకాలు అందించేవార‌న్నారు. అలాగే వారిని ఆదరించి అవసరమైన సహాయం చేస్తూ ఉండేవాడ‌న్నారు.

అలాగే ప్రకృతి విపత్తులు జరిగినప్పుడు నష్టపోయిన బాధితులకు తనవంతు సహాయం చేస్తూ పోలీసు వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకువ‌చ్చార‌ని క్ర‌మం త‌ప్ప‌కుండా వృత్తి ధ‌ర్మం నిర్వ‌ర్తించి… తన వంతు పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. కొమిరి కృష్ణమూర్తి సేవ‌లు గుర్తించి రేంజ్ డీఐజీ చేతులమీదుగా ప్ర‌శంసాప‌త్రాన్ని పొందినందుకు పోలీసు అధికారుల‌, సిబ్బంది అభినంద‌న‌లు తెలియ చేసారు.

Related posts

సరిగా చదువు చెప్పమన్మందుకు హెడ్మాస్టర్ పై టీచర్ దాడి

Satyam NEWS

ఒంటరినయ్యాను… కన్నీరు ఆగనంటోంది…..

Satyam NEWS

మహాదేవ్ యాప్ కార్యాలయంలలో ఈడి సోదాలు

Bhavani

Leave a Comment