శ్రీకాకుళం రూరల్ మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పాత్రుని వలస లో రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన బైజుస్ కంటెంట్ తో ఉన్న ట్యాబులను ప్రధానోపాధ్యాయులు ఐ.డి.వి ప్రసాద్ అధ్యక్షతన పాఠశాల పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో 32 మంది 8 వ తరగతి విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు అందించిన ట్యాబ్ ద్వారా విద్యలో సాంకేతికతను జోడించి మంచి విజ్ఞానాన్ని సంపాదించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల పేరెంట్స్ కమిటీ చైర్మన్ మొ య్యిల వాసుదేవ రావు , వైస్ ఛైర్మన్ గొర్లే స్వాతి గ్రామ పెద్దలు బాణాల గాంధీ, పల్లి వైకుంఠ రావు మరియు పేరెంట్స్ కమిటీ సభ్యులు విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కరణం శ్రీహరి, బలివాడ ప్రభాకర్ రావు, బుడుమూరు అప్పలనాయుడు, బెండి శారద, పిసిని వసంతరావు, గండ్రేటి వినయ్ కుమార్, పొ న్నాన ఉషారాణి రాజనాల సతీష్ రాయుడు, బొంగు వెంకటరమణమూర్తి, సంపతిరావు రమణమ్మ, కొణపల శ్రీనివాసరావు,నక్కిన స్వప్న తదితరులు పాల్గొన్నారు.