42.2 C
Hyderabad
May 3, 2024 15: 27 PM
Slider రంగారెడ్డి

కార్పొరేటర్ శ్రీదేవిని ఘనంగా సత్కరించిన డివిజన్ నాయకులు

#Corporator Sridevi

రాజకీయ రంగంలో విశేష ప్రతిభ కనబర్చిన బీసీ మహిళ సావిత్రిబాయి ఫూలే 192వ జయంతి ఉత్సవాల సందర్భంగా రవీంద్ర భారతిలో చర్లపల్లి కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ కి సావిత్రిభాయి పూలే అవార్డ్ ను ప్రధానం చేశారు. ఈ సందర్భంగా చర్లపల్లి డివిజన్ నాయకులు శుభాకాంక్షలు తెలియజేశారు.

డివిజన్ నాయకులు మాట్లాడుతూ కార్పొరేటర్ శ్రీదేవి ఎల్లవేళాల ప్రజలకు అందుబాటులో ఉంటూ అటు రాజకీయంలో, సంఘం కార్యక్రమాలు,గృహిణిగా తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ముందు ముందు అనేక కార్యక్రమాలలో విజయం పొంది మరెన్నో ఆవార్డులు గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు నాగిళ్ల బాల్ రెడ్డి, బొడిగె ప్రభు గౌడ్ ,బత్తుల శ్రీకాంత్ యాదవ్, రాజు గౌడ్ . చిందం నరసింహ వంశి రాజ్ , హరినాథ్, మెర్ విజయ్ కుమార్, కె శ్రీనివాస్, రామకృష్ణ, గోపి ,,పాండు, శంకర్ ,సదానంద్ ,మురళి గౌడ్ ,చిట్టిబాబు ,రాజు, ప్రసాద్ ,రాములు ,తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

ఓయూ లో చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మ దగ్దం

Satyam NEWS

ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్థాపించాలి

Bhavani

ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Satyam NEWS

Leave a Comment