28.7 C
Hyderabad
April 28, 2024 04: 00 AM
Slider హైదరాబాద్

ఓయూ లో చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మ దగ్దం

#osmaniauniversity

గిరిజనుల ఆరాధ్య దైవం అయిన సమ్మక్క సారక్కల పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన దొంగ స్వామి చిన జీయర్ స్వామిని తెలంగాణ రాష్ట్రం నుంచి బహిష్కరించాలని యూనివర్సిటీ దళిత, బహుజన, గిరిజన విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ఎదురుగా గిరిజన విద్యార్థి సంఘాలు, దళిత, బహుజన సంఘాల  ఆధ్వర్యంలో చిన జీయర్ స్వామి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. గతంలో ప్రపంచంలోని గిరిజనులు తమ ఇంటి దైవంగా భావించే సమ్మక్క-సారక్క లపై తన ప్రసంగంలో అవమానపరిచే విధంగా మాట్లాడిన  చిన జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BSF OU అధ్యక్షులు బోరెల్లి సురేష్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షులు శరత్ నాయక్, లంబాడా హక్కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈశ్వర్ నాయక్, ఉపాధ్యక్షులు మోహన్ నాయక్, ట్రైబల్ స్టూడెంట్ సమితి నాగేశ్వర్ రావు నాయక్, MSF రాష్ట్ర నాయకులు విజయ్, T MSF రాష్ట్ర ఉపాధ్యక్షులు తప్పెట్ల ప్రవీణ్, AISF కంపల్లీ శ్రీనివాస్, టీ కాంగ్రెస్ నాయకులు అర్జున్ నాయక్, గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సుబ్బు నాయక్, ట్రైబల్ స్టూడెంట్ సమితి నాయకులు శ్రీను నాయక్, రవి భూక్యా, వెంకటేశ్ పవర్, గిరిజన శక్తి ఓయూ అద్యక్షులు హన్మంతు నాయక్, వినోద్, మహేష్, ప్రణయ్, సూరజ్ నాయక్, ప్రసాద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ దేశానికి ఏమైంది? ఆందోళనకర పరిస్థితుల్లో ఐదుగురు సీఎంలు

Satyam NEWS

*సెప్టెంబర్ 18నుండి గిరిజన జాతీయ సభలు

Bhavani

ఎన్టీఆర్ మున్సిపల్ హైస్కూల్ లో విద్యార్థులకు కళ్ళద్దాలు పంపిణీ

Satyam NEWS

Leave a Comment