జీవో నెంబర్ 76 ప్రకారం క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లుకు తావు లేకుండా నిష్పక్షపాతంగా విచారణ ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ఐడిఓసి కార్యాలయం నుండి విచారణ ప్రక్రియపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో క్రమబద్ధీకరణ పట్టాల ప్రక్రియపై క్షేత్రస్థాయి విచారణ నిర్వహించుటకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. క్రమబద్ధీకరణ ప్రక్రియలో ఇంటి నెంబరు, విద్యుత్, నీటి బిల్లులు తదితర అంశాలను కూలంకషంగా పరిశీలించాలని ఆయన సూచించారు. సింగరేణి అప్పగించిన భూములలో నివాస స్థలాలు ఏర్పాటు చేసుకున్న వారికి మాత్రమే విచారణ నిర్వహించాలని ఆయన తెలిపారు. కొత్తగూడెం, ఇల్లందు మండలాల్లో సర్వే ప్రక్రియ నిర్వహణకు ఏర్పాటుచేసిన టీములు తక్షణమే రిపోర్ట్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు మేరకు సింగరేణి అప్పగించిన భూముల్లో మాత్రమే ఇంటి స్థలాల క్రమబద్ధీకరణ పట్టాలు జారీచేయాలని ఇతర ప్రభుత్వ స్థలాలు తదితర వాటి జోలికి వెళ్ళకొద్దని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు,డిఆర్ఓ అశోక్ చక్రవర్తి తాసిల్దారులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post