కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలంలోని మంజీర పరివాహక ప్రాంతాలైన సెట్ల్లూర్, ఖడ్గం, కుర్లా౦ గ్రామాలలో నుండి (టీఎస్ఎండీసీ )తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఇసుక రవాణకు ప్రభుత్వం అనుమతులు జారీ అయ్యాయని ప్రభుత్వ అభివృద్ధి పనులకు ఇసుకను తరలించాలని జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి అన్నారు.
గురువారం ఆయా గ్రామాలలో ఆయన పర్యటించి స్థానిక సర్పంచులతో మాట్లాడారు. వారం రోజుల క్రితం ఇసుక అనుమతులు రద్దు చేయాలంటూ కథగా౦ గ్రామ పంచాయతీ తీర్మానం చేసిన విషయం విదితమే. ఇసుక రవాణా చేయడంతో బోరుబావులు భూగర్భ జలాలు అడుగంటిపోయి తమ పంట చేలకు నష్టం వాటిల్లుతుందని రైతులు ఈ సందర్భంగా కలెక్టర్ దృష్టికి తీసుకుపోగా కలెక్టర్ ఆదేశాల మేరకు జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి ఆయా గ్రామాలలో పర్యటించారు.
ఖతగా౦ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ గ్రామస్తులతో మాట్లాడిన ఆయన పై విషయంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇసుక రవాణాను అడ్డుకుంటే చట్టరీత్యా చర్యలు తప్పవని అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించరాదన్నారు. కార్యక్రమంలో జెయి౦ట్ కలెక్టర్తో పాటు బాన్స్వాడ ఆర్డీఓ రాజేశ్వర్ డీఎస్పీ దామోదర్రెడ్డి తహసీల్దార్ వెంకట్రావు ఉన్నారు.