రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్లే బాయ్ సినిమా హీరో దినేష్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు వెంకటగిరి కాలనీ పార్క్ లో ప్లే బ్యాక్ సినిమా యూనిట్ సభ్యులు మొక్కలు నాటారు.
మొక్కలు నాటిన వారిలో హీరోయిన్ స్పందన, హీరో దినేష్ తేజ, అర్జున్ కళ్యాణ్, సీనియర్ జర్నలిస్టు మూర్తి(TV5) టిఎన్ఆర్(IDremms) అశోక్ వర్ధన్, జక్క హరిప్రసాద్ ఉన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు మూర్తి TV5 మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం విజయవంతమైందని, హరితహారం స్ఫూర్తితో సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు.
తనను ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం బాగా ఆకట్టుకుందని, ఇప్పటికే మనం నీరు కొనుక్కుంటున్నామని, భవిష్యత్తులో ఆక్సిజన్ కొనుక్కునే ఈ పరిస్థితి రాకూడదని అన్నారు. భవిష్యత్ తరాలకు మనం ఇచ్చేది ఒకటే మంచి వాతావరణాన్ని అందించడం. కాబట్టి మనందరం కూడా మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో పౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.