నేషనల్ డాక్టర్స్ డే ను పురస్కరించుకొని ములుగు లో తెలంగాణ ప్రజా సేన, నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ డాక్టర్, సామాజిక సేవకుడు పోరిక రవీందర్ కు సన్మానం జరిగింది. డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపి ఆయనను శాలువాతో సన్మానించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ రవీందర్ వృత్తి పరంగా ప్రవృత్తి పరంగా ములుగు జిల్లాలో సేవలు అందిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సేన జాతీయ అధ్యక్షులు బొమ్మ కంటి రమేష్ వర్మ, నేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు, తెలంగాణ ప్రజా సేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్క రాజు లతో పాటు అలువాల సదానందం, సామర్ల గణేష్,అజయ్, దినాకర్ తదితరులు పాల్గొన్నారు.