శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం స్వల్పంగా పెరిగింది. రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై ఓటింగ్ సమయంలో గైర్హాజరైన అప్పటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే డొక్కా మాణిక్యవరప్రసాద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టిక్కెట్ ఇచ్చి గెలిపించుకుంది.
దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం కౌన్సిల్ లో 13కు పెరిగింది. తెలుగుదేశం పార్టీకి 27 స్థానాలు ఉన్నాయి. ఇందులో ముగ్గురు అటు ఇటుగా ఉన్నందున తెలుగుదేశం పార్టీకి నికరంగా 24 మంది సభ్యులు ఉంటారు. డొక్కా మాణిక్యవరప్రసాద్ కు నేటి సాయంత్రం 3.30 గంటలకు వెలగపూడి లోని అసెంబ్లీ లెజిస్లేచర్ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఎన్నికల పత్రాన్ని అందచేశారు.