ఎటువంటి ఆకాంక్షలు లేకుండా అక్టోబర్ 18 నుండి దేశీయ విమాన కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం చాలా వరకు వ్యాక్సిన్ వేయించుకోవడం, కరోనా కేసులు తగ్గుతుండటంతో ప్రయాణికుల పరిమితిపై ఆంక్షలు ఎత్తివేస్తూ పౌర విమానయాన మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది.
గతంలో 85 శాతం సామర్థ్యంతో మాత్రమే ప్రయాణికులను విమానంలోకి అనుమతించారు. తాజా ఉత్తర్వులతో విమానాల్లో వంద శాతం ప్రయాణికులను అనుమతించనున్నారు. అక్టోబరు 18 నుంచి విమానయాన సంస్థలు వంద శాతం టిక్కెట్లను విక్రయించనున్నాయి.