37.2 C
Hyderabad
May 2, 2024 12: 42 PM
Slider పశ్చిమగోదావరి

ద్వారకా తిరుమలలో నిత్యాన్నదానానికి భారీ విరాళం

#dwaraka tirumala

పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానం లో నిర్వహిస్తున్న నిత్యా అన్నదాన కార్యక్రమానికి తాడేపల్లిగూడెం లో సత్యవతి నగర్ వాసులు  సాధనాల చంద్రశేఖర్, రాజరాజేశ్వరి దంపతులు   (పైడిపాలగోత్రం) 1లక్షా ఒక్కరూపాయి విరాళంగా అందించారు.

ఆదివారం నాడు ఆలయ ఈ ఓ జి వి సుబ్బారెడ్డికి ఈ విరాళాన్ని అందజేశారు. చంద్రశేఖర్ దంపతులను ఆలయ మర్యాదలతో గౌరవించి స్వామివారి దర్శనం చేయించి స్వామివారి వస్త్రంతోపాటు లడ్డూ ప్రసాదాన్ని ఈ ఓ అందజేశారు.

స్వామివారి ఆలయంలో లోక కళ్యాణం కోసం నిర్వహిస్తున్న శాశ్వత ఉచిత అన్నదాన కార్యక్రమానికి దాతలు తమవంతు విరాళాలు అందించి స్వామివారి సేవ తోపాటు చిన్నతిరుపతి స్వామివారి కృపా కటాక్షములు పొందాలని ఈ ఓ సుబ్బారెడ్డి దాతలను కోరారు

Related posts

మెగా సినిమాలు ఒకేరోజు రీ రిలీజ్ చేయకూడదనుకున్నాం

Bhavani

కేటీఆర్ కు ఆస్ట్రేలియా-ఇండియా లీడర్ షిప్ ఆహ్వానం

Satyam NEWS

నష్టాల్లో ఉంటే విశాఖ ఉక్కును ప్రయివేటు వాళ్లు ఎలా నడుపుతారు?

Satyam NEWS

Leave a Comment