35.2 C
Hyderabad
May 1, 2024 01: 25 AM
Slider ఆధ్యాత్మికం

మేళ్ళచెరువు శివాలయం అభివృద్ధికి గ్రామ ప్రజల విరాళం

#Mellacheruvu Temple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు తమ వంతు సహాయంగా గ్రామ ప్రజలు తోడ్పాటును అందిస్తూ దేవాలయ అభివృద్ధికి చేయూతను అందిస్తున్నారు.

దేవాలయంలోని పడమర సింహద్వార నిర్మాణంలో   భాగంగా మంగళవారం మేళ్ళచెరువు గ్రామానికి  చెందిన భోగాల కోటిరెడ్డి ధర్మపత్ని కన్యా కుమారి  తమ వంతు సహాయంగా 70 వేల రూపాయల ఆర్థిక విరాళాన్ని దేవాలయ చైర్మన్ కొండా రెడ్డి  అందించారు.

ఈ సందర్భంగా కొండా రెడ్డి మాట్లాడుతూ దేవాలయాన్ని అన్ని విధాలుగా పూర్తిచేసే విధంగా గ్రామ ప్రజలు, ఇతరులు కూడా తమ వంతు సాయం చేస్తూ ముందుకు వస్తున్నారని వారందరికీ శ్రీ శంభు లింగేశ్వర స్వామి  ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని  అన్నారు.

ఈ కార్యక్రమంలో దాతల కుటుంబ సభ్యులు,దేవస్థాన మేనేజర్ సత్యనారాయణ, ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

సీఎం జ‌గ‌న్ జ‌న్మ‌దినం.. పార్టీ సేవా కార్య‌క్ర‌మాలు

Sub Editor

రైతుల ఉద్యమానికి మద్దతుగా ఐ ఎన్ టి యు సి ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

చెక్కు బౌన్స్ కేసులో నిందితునికి శిక్ష ఖరారు

Murali Krishna

Leave a Comment