సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని శ్రీ ఇష్టాకామేశ్వరి సమేత శ్రీ స్వయంభు శంభులింగేశ్వర స్వామి దేవాలయానికి దాతల నుండి మంచి స్పందన వచ్చింది. స్థానిక శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సహకారంతో ఆలయ చైర్మన్ భోగాల కొండారెడ్డి ఆలయ అభివృద్ధి పనులు చేపట్టారు.
దీనిలో భాగంగా ఆలయంలో నూతనంగా జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమలకు దాతలు తమ వంతుగా సహకరిస్తున్నారు. వేపలమాధారం గ్రామానికి చెందిన జక్కుల శంభయ్య దంపతులు సోమవారం ఆలయ చైర్మన్ కొండారెడ్డికి 24,000 రూపాయలు విరాళంగా అందజేశారు.
ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొండారెడ్డి మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే సైదిరెడ్డి సహకారంతో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు భక్తులు కూడా స్వచ్ఛందంగా సహాయసహకారాలు అందించడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల కార్మికశాఖ అధ్యక్షులు సాముల వెంకట్ రెడ్డి, మేనేజర్ చిట్టిప్రోల్ సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ కూన్ రెడ్డి కొండారెడ్డి, ఆలయ అర్చకులు కొంకపాక విష్ణువర్ధన్ శర్మ,ధనుంజయ శర్మ,తదితరులు పాల్గొన్నారు.