ఈనెల 22 మధ్యాహ్నం తర్వాత ఏపీ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారు చేశారు. ఇప్పటి వరకూ మంత్రులుగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వెంకట రమణ రాజ్యసభ సభ్యులుగా వెళ్లిపోవడంతో మంత్రి వర్గంలో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి.
వాటిని అదే సామాజిక వర్గానికి చెందిన వారితో భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించినట్లు తెలిసింది. అందులో భాగంగా రామచంద్రాపురం ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణు గోపాలకృష్ణ, పలాస ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజుకు కేబినెట్లో చోటు దక్కే అవకాశం ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. 22 న ఇద్దరు కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణస్వీకారం చేస్తారు.