పట్టాలున్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని పుట్టా ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని గాంధీనగర్ హరిజనవాడలో తెలంగాణ ప్రజాసంఘాల పోరాట వేదిక నాయకులు సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టా ఆంజనేయులు మాట్లాడుతూ వనపర్తి జిల్లాలోని 18వ వార్డులో 685 మందికి 2008 అక్టోబర్ లో సర్వేనెంబర్ 143 145 లో ఇండ్ల స్థలాలకు పట్టాలు ఇచ్చారని, కాగా నేటికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవడానికి చోటును చూపలేదని విమర్శించారు.అట్టి స్థలంలో డబల్ బెడ్ రూమ్ లు నిర్మించారని, కాగా పట్టాలు ఉన్న పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని లేనియెడలా ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్య పై ఫిబ్రవరి మూడో తేదీన వనపర్తి తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టనున్నట్లు, లబ్ధిదారులు వ్యక్తిగత దరఖాస్తులతో ధర్నాకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రజా సంఘాల పోరాట వేదిక నాయకులు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post