39.2 C
Hyderabad
May 3, 2024 11: 50 AM
Slider హైదరాబాద్

అంబర్ పేట లో లబ్ధిదారులకు బెడ్ రూం ఇండ్ల అందజేత

#kaleru

పేదల సొంతింటి కలను సాకారం చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు అందిస్తున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల పంపిణీలో భాగంగా గురువారం మూడో విడతలో తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తీగుళ్ళ పద్మారావు గౌడ్ తో కలిసి అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, అంబర్ పేట నియోజకవర్గంలోని 1164 మంది లబ్ధిదారులకు, కీసర మండలం రాంపల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లను పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, నిరుపేదలకు శాశ్వత నివాసం ఏర్పాటు చేస్తున్న సీఎం కేసీఆర్ కి ధన్యవాదాలు తెలుపుతూ, ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం ప్రజల గుండెల్లో ఎల్లప్పుడూ నిలిచిపోతారని పేర్కొన్నారు. ఇవాళ సుమారు 100 కోట్ల విలువైన ఇళ్లను అందించినట్లు, ఇంకా తదుపరి దశల్లో మిగతా వారికి కూడా ఇళ్లు లభించనున్నాయని ప్రజలకు తెలిపారు. అత్యంత కోలాహలం నడుమ అంబర్ పేట ఎంసీహెచ్ గ్రౌండ్స్ నుండి ఎమ్మెల్యే పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు, వారి కుటుంబ సభ్యులు, నాయకులతో కలిసి రాంపల్లికి చేరుకొని, వారికి ఇళ్లను అందచేశారు. సొంతింటి కల సాకారం అయ్యిందని ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ, లబ్ధిదారులు సీఎం కేసీఆర్ కి, ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు విజయ్ కుమార్ గౌడ్, పద్మావెంకట్ రెడ్డి, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

తొలగించిన ఓట్లను మరోసారి పరిశీలించాలి

Bhavani

పార్టీ విలీనంపై సెప్టెంబరు 30లోపు నిర్ణయం

Bhavani

సిఎం నిర్ణయంపై రాజధాని రైతుల నిరసన

Satyam NEWS

Leave a Comment