సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని వేపలసింగారం గ్రామంలో స్థానిక శాసన సభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సూచనమేరకు14వ ఆర్థిక సంఘం నిధుల నుండి సిసి డ్రైనేజిలను సర్పంచ్ శిరీష కొండారెడ్డి కొబ్బరికాయకొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ శిరీష మాట్లాడుతూ గ్రామంలో డ్రైనేజీలు, సి సి రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి వెంటవెంటనే పనులను చేసి ప్రజల అవసరాలను తీర్చి ప్రజలకు అనుగుణంగా పనిచేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు వరలక్ష్మి,రాంమోహన్ రెడ్డి, కొండారెడ్డి, హరిలీల, చిన్నప్ప, నర్సిరెడ్డి కార్యదర్శి ఉపేందర్ పాల్గొన్నారు.
ఇంకా, సుధీర్ గ్రామ పెద్దలు పల్లె నాగిరెడ్డి,దేశిరెడ్డి రోసిరెడ్డి, రెక్కల శంభిరెడ్డి,నక్కా వేణు, కుందూరు కోటిరెడ్డి, సారెడ్డి భాస్కర్రెడ్డి, నందిరెడ్డి సైదిరెడ్డి, చక్కర రాంబాబురెడ్డి,వెంకటాచారి, రోషయ్య,నాగేష్,రత్నం ,రాంరెడ్డి, మంగమ్మలు కూడా పాల్గొన్నారు.