తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ నెలలో జరుగనున్న విశేష పర్వదినాల వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
ఏప్రిల్ 1న ఉదయం 9 గంటలకు తిరుమల ఆస్థానమండపంలో గ్రంథాల ఆవిష్కరణ. ఇందులో శ్రీ నరహరి తీర్థ, శ్రీ జయతీర్థ, శ్రీ శ్రీపాదరాజ, శ్రీ వ్యాసరాజ యతీశ్వరుల సంకీర్తనలతో కూడిన ప్రథమ, ద్వితీయ సంపుటాలు ఉన్నాయి.
ఏప్రిల్ 6న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం.
ఏప్రిల్ 8న అన్నమాచార్య వర్ధంతి.
ఏప్రిల్ 9న శ్రీ భాష్యకారుల ఉత్సవారంభం.
ఏప్రిల్ 13న ప్లవనామ సంవత్సర ఉగాది, శ్రీవారి ఆస్థానం.
ఏప్రిల్ 18న శ్రీరామానుజ జయంతి.
ఏప్రిల్ 21న శ్రీరామనవమి ఆస్థానం.
ఏప్రిల్ 24 నుండి 26వ తేదీ వరకు వసంతోత్సవాలు.