విశాఖపట్నం నగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం చెలరేగింది. ఎన్ఏడి జుంక్షన్ వద్ద టాస్క్ ఫోర్స్, ఎయిర్ పోర్టు జోన్ పోలీసులు భారీ ఎత్తున డ్రగ్స్ పట్టుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక యువతిని మరో యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన ఆ యువతి ది హైదరాబాద్ గా పోలీసులు తెలిపారు. అదే విధంగా యువకుడు వైజాగ్ కు చెందిన వాడుగా పోలీసులు గుర్తించారు. టాబ్లెట్ రూపంలో ఉన్న 18 పిల్స్,2 ఎండిఎంఏ పిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఏసీపి శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్ తెలిపారు.
previous post
next post