ఉభయ తెలుగు రాష్ఠ్రాల ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అర్ధరాత్రి దాటితే మందుబాబులు రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు పెడుతూ ఉంటే అటు ట్రాఫిక్ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేపడుతూ ఉంటారు. ఇక ఆ చెడు సంస్కృతి పుణికి పుచ్చుకున్నట్టున్నారు.. ఉత్తరాంధ్ర వాసు లు… అందులో విజయనగరం వాసులు.ఈ మేరకు విద్యలనగరమైన విజయనగరంలో గంట స్తంభం సాక్షిగా మందు బాబులు మందేసారు. అక్కడే ట్రాఫిక్ విధులు నిర్వహిస్తున్న ఎస్ ఐ రాజు… నిబద్ధతో తన విధులు నిర్వహించారు. కళ్లముందు మద్యం సే వించి కనిపించిన వ్యక్తులను గుర్తించారు. ఆ వెంటనే తన సిబ్బంది సహాయంతో డ్రంక్ అండ్ డ్రైవ్ మిషన్ తెప్పించారు. ఇక ఎస్పీ ఆదేశాలు.. డీస్పీ సూ చనలతో సదరు వ్యక్తులకు డీడీ మిషన్ ద్వారా టెస్ట్ చేయడంతో వచ్చిన రీడింగ్ చూసి నివ్వెరపోయారు. దీంతో నిబంధనల ప్రకారం… చలానా రాసి కోర్ట్ కు పంపించారు. అయితే ఇది చూసిన నగర ప్రజ శహభాష్ ట్రాఫిక్ పోలీస్ అంటూ కితాబు ఇవ్వడం… ” సత్యం న్యూస్. నెట్” కంటపడటం విశేషం.
previous post