కొత్త సంవత్సరపు వేడుకల మత్తు ఇంకా దిగలేదు. ఎవరు ఎంత మొత్తుకుంటున్నా మద్యం మత్తులో డ్రైవ్ చేయడం ఆపడం లేదు. మద్యం కారణంగా హైదరాబాద్ బంజారా హిల్స్ లో మరో రోడ్డు ప్రమాదం జరిగింది. నేటి తెల్లవారు జామున బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 3 కేబీఆర్ పార్క్ దగ్గర మద్యం మత్తులో బైక్ పై వేగంగా ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు రోడ్డు డివైడర్ ను ఢీ కొన్నారు.
దాంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రంగా గాయాలయ్యాయి. అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.