38.2 C
Hyderabad
May 2, 2024 22: 44 PM
Slider కడప

డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డికి పౌర సన్మానం

DSP

కడప జిల్లా రాజంపేట గత డీఎస్పీ నారాయణ స్వామిరెడ్డికి పౌర సన్మానం నిర్వహించారు. పట్టణంలోని కాకతీయ విద్యాసంస్థలు ప్రాంగణంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రెవెన్యూ డివిజన్ పరిధిలో కోవిడ్ సమయంలో విశిష్ట సేవలకు పౌర సంఘాలు, ప్రవేటు పాఠశాలల యాజమాన్యం ఆధ్వర్యంలో సన్మానం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన్ను ప్రవేటు స్కూల్స్ అధినేత పోలా రమణా రెడ్డి, హ్యూమన్ రైట్స్ డివిజన్ ఇంచార్జీ సురేపల్లె శ్రీనివాసులు, వైసీపీ నేత మర్రి రవి, ఆర్య వైశ్య సంఘ అధ్యక్షుడు పాల ప్రకాష్ తదితరులు పూలమాలలు, శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఏంతో మంది అధికారులు వస్తూ, పోతూ ఉంటారు. అందులో కొంత మంది మాత్రం ప్రజల హృదయాల్లో చిర స్టాయిగా నిలిచిపోతారు. అలాంటి కోవకి చెందిన వ్యక్తి డిఎస్పీ నారాయణ స్వామి రెడ్డి అన్నారు. ముఖ్యంగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వహిస్తు, పనిచేస్తే కాని పూటగడవని ఎన్నోకుటుంబాలకు అండగా నిలిచి వాళ్ళ మన్ననలు పొందారన్నారు.

లాక్ డౌన్ సమయంలో సహాయం కోసం ఎదురు చూస్తున్నమారుమూల ప్రాంతాలతో పాటు, వలస కూలీలు, ఆటో, రిక్షా, దినసరి కూలీల ఆకలి తీర్చడమే కాకుండా అన్ని విధాలా వాళ్ళను అదుకొని మానవత్వాన్ని చాటు కున్నారని కొనియాడారు.

విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి డిఎస్పీ నారాయణ స్వామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కొండగట్టు అంజన్న క్షేత్రానికి మరో రూ.500కోట్లు

Satyam NEWS

కరోనా…కరోనా… ఏం పీడతెచ్చి పెట్టావే మాయదారి రోగమా

Satyam NEWS

మెటర్నిటీ హెల్త్ అవార్డు గ్రహీతలకు అభినందన

Bhavani

Leave a Comment