విద్యార్థులు బాగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట మండలం ఎర్కారం గ్రామానికి చెందిన చప్పిడి కృష్ణారెడ్డి మనవరాలు పులగం సాధిక కొద్దిరోజుల క్రితం ఎంటెక్ లో గోల్డ్ మెడల్ సాధించడంతో విషయం తెలుసుకున్న మంత్రి జగదీశ్ రెడ్డి ఆమెను సూర్యా పేట లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు నిరంతరం కష్టపడి చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చదువుతోనే విద్యార్థులకు భవిష్యత్తు ఉంటుందని పేర్కొన్నారు ఈ సందర్భంగా సాధికను పలువురు అభినందించి హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో సాధిక తండ్రి వెంకట్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వై.వి.జిల్లా నాయకులు చిన్న శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.