28.2 C
Hyderabad
May 9, 2024 03: 05 AM
Slider గుంటూరు

మోడీకి లొంగిపోయిన జగన్, చంద్రబాబు

#navataramparty

రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మోడీ నిలబెట్టిన అభ్యర్థి కి మద్దతు అడగకుండానే ప్రకటించడం దారుణంగా ఉంది అని,మోడీకి దాసులు గా వ్యవహారం చేయడం ఆంధ్రప్రదేశ్ హక్కులు తాకట్టు పెట్టడమే అని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావుసుబ్రహ్మణ్యం అన్నారు.

రాష్ట్రపతి అభ్యర్థి ముర్ము కి తాము వ్యతిరేకం కాదని, రాష్ట్ర విభజన హామీలు అంశం,ప్రత్యేక హోదా గురించి స్పష్టమైన హామీ తీసుకోకుండా మోడీ బలపరిచిన అభ్యర్థి కి మద్దతు ఇవ్వడం రాష్ట్రానికి అన్యాయం చేయడమే అని రావుసుబ్రహ్మణ్యం అన్నారు. రాష్ట్రపతి ఎన్నిక ఓటింగ్ సంధర్భంగా ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ పిలుపు మేరకు గుంటూరు లోని హిందు కాలేజ్ సెంటర్ లో నవతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకూరి కవిత ఆధ్వర్యంలో 18.07.2022 సోమవారం ఉదయం10 గంటల సమయం లో జరిగిన నిరసన కార్యక్రమంలో రావుసుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

నల్ల కండువాలు ధరించి నిరసన తెలియజేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే దిశగా జగన్, చంద్రబాబు పోరాడాలని డిమాండ్ చేశారు.ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో షేక్ సులేమాన్, రజియా, లోకమ్మ, రజని, ఇండియా ,సత్యం, స్వప్న తదితర నవతరం పార్టీ నేతలు నిరసన లో పాల్గొన్నారు.

Related posts

రోడ్డు ప్రమాదాల నియంత్రణపై అవగాహన కార్యక్రమాలు

Satyam NEWS

కౌలు రైతులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేయాలి

Satyam NEWS

దళిత బంధు  దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది

Satyam NEWS

Leave a Comment