రాష్ట్రంలో సైకో పాలన మూలంగా నాటి కాలం నుంచీ ఇప్పటి వరకు ఉన్న విద్యా ప్రమాణాలు మరుగున పడుతున్నాయని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. ఎన్టీఆర్ వర్డంతి సందర్బంగా విజయనగరంలో ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఆయన అంజలి ఘటించారు. ఈ సందర్భంగా టీడీపీ సీనియర్ నేత, పోలిట్ బ్యూరో సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి అఃశోక్ గజపతిరాజు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అన్న నానుడికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో సైకో పాలన సాగతోందని విమర్శించారు. తెలుగు మాధ్యమం పూర్తిగా విస్మరించి దిగువ స్థాయి నుంచీ అంటే ఎలిమంటరీ నుంచీ ఇంగ్లీష్ ప్రవేశ పెట్టడం ఈ సైకో పాలనకే చెందిందన్నారు. సాక్షాత్తు సుప్రీం కోర్టే స్థానిక మాధ్యమాలలో బోధన సాగించాలని చెప్పినా ఆ సర్వోన్నత న్యాయస్థానం మాటలను పెడచెవిన పెట్టిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికే దగ్గుతుందని అశోక్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఈ కార్యక్రమంలో అశోక్ గజపతి రాజుతో పాటు నగర టీడీపీ అధ్యక్షుడు ప్రసాదుల లక్ష్మీ వర ప్రసాద్,ఆదితీ గజపతి రాజు ,బంగార్రాజు తదితరులు పాల్గొన్నారు.
previous post
next post