సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ గ్రంథాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గా స్థానికుడు విద్యావంతుడు యువకుడు పిన్నాని సంపత్ వర్మ(దళపతి)ను ఎంపిక చేస్తూ సూర్యాపేట జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ నియామక పత్రాన్ని అందించారు.
హుజూర్ నగర్ నూతన గ్రంథాలయ అభివృద్ధి కమిటీ ఇది
చైర్మన్ గా పిన్నాని సంపత్ వర్మ (దళపతి), ఉపాధ్యక్షుడుగా పిట్టల అరవింద్, ప్రధాన కార్యదర్శిగా షేక్ సద్ధాం, కోశాధికారిగా మోహన్ నాయుడు, ఆర్గవైజింగ్ కార్యదర్శిగా విజయ్ గౌడ్,సభ్యులుగా ఆవుల మహిష్ గౌడ్,చక్రాల నాగేశ్వర రావు, శ్రీనాథ్,సతీష్ ,రంజిత్, సుప్రియా లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
హుజూర్ నగర్ గ్రంథాలయ అభివృద్ధి నూతన కమిటీ చైర్మన్ సంపత్ వర్మ మాట్లాడుతూ తన నియమాకానికి సహకరరించిన స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి,జిల్లా గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు.