29.7 C
Hyderabad
April 29, 2024 08: 24 AM
Slider

మంత్రుల పర్యటన కు విస్తృత ఏర్పాట్లు

#ministerial visit

జిల్లాలో రాష్ట్ర ఐటి, పురపాలన, పట్టణాభివృద్ధి, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు, రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ల పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు.

కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో పోలీస్ కమీషనర్ విష్ణు ఎస్. వారియర్ తో కలిసి అధికారులతో ఏర్పాట్లపై సమీక్షించారు. శనివారం జిల్లాలో కొనిజర్ల మండలం గుబ్బకుర్తిలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు శంకుస్థాపన తో జిల్లా పర్యటన ప్రారంభం కానున్నదని ఆయన అన్నారు. ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనల ప్రదేశాల్లో అన్ని సిద్ధం చేయాలని, అధికారులు తమకు కేటాయించిన విధులు సమర్థవంతంగా నిర్వర్తించాలని ఆయన తెలిపారు.

రూట్ మ్యాప్ పై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎక్కడా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.ఈ సమావేశంలో ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్, అదనపు డిసిపి లు ప్రసాద్ రావు, బోస్, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నార

Related posts

కొల్లాపూర్ మున్సిపాలిటీ లో పెరిగిన ప్రజాసమస్యలు

Satyam NEWS

శ్రమ సంస్కృతి దినోత్సవ”మే” డే

Satyam NEWS

ఈ ఉన్మాది సీఎంగా ఉంటే ఏపీలో అడుగుపెట్టలేనేమో

Satyam NEWS

Leave a Comment