బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి వెల్లడి
కామారెడ్డిలో అవినీతి రహిత పాలన అందిస్తానని, ప్రజలు ఆలోచించి ఓటువేసి గెలిపించాలని బీజేపీ కామారెడ్డి అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. ఇవాళ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని 49 వార్డులలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సుమారు 10 వేల మంది నిర్వహించిన ర్యాలీ కార్యకర్తల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా రమణారెడ్డి మాట్లాడుతూ.. అవినీతి రహిత కామారెడ్డి కోసం తాను తపిస్తున్నానన్నారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ గెలిస్తే కామారెడ్డిలో ఉండే పరిస్థితి లేదని, తాను ఇక్కడే ప్రజలకు అందుబాటులో ఉంటాన్నారు. భూ కబ్జాల నుంచి కామారెడ్డి విముక్తి కావాలన్నారు.