Slider రంగారెడ్డి

ఉప్పల్  ప్రజల కోసం, ప్రగతి కోసం  ప్రభాకర్ ని గెలిపించండి

#bjp

తెలంగాణ  అభివృద్ధ పథంలో సాగాలంటే కమలం పువ్వుకు ఓటు  వేసి  ఉప్పల్  బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి  ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రామంతపూర్ బిజెపి డివిజన్ అధ్యక్షుడు బండారు వెంకట్రావు, కార్యదర్శి సుంకూర్ కుమార్ స్వామి లు అన్నారు. సోమవారం  కామాక్షి పురం, రాజేంద్రనగర్ ల లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ  అభివృద్ధ పథంలో సాగాలంటే కమలం పువ్వుకు ఓటు  ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ మాయమాటలు నమ్మి రాష్ట్ర అభివృద్ధిని కుంటుపరచందని అన్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం హామీలు, మాయమాటలను ప్రజలు విసిగి వేసారి పోయారని, ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రానున్న ఎన్నికల్లో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయమని ఓటర్లకు వివరించారు. ఉప్పల్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి ప్రభాకర్ ని బారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో కాలనీవాసులు  వీణ, శక్తి కేంద్రం ఇంచార్జ్ డివిజన్ ప్రధాన కార్యదర్శి, ఉలు నారాయణదాసు, శక్తి కేంద్రం ఇన్చార్జులు వేముల తిరుపతయ్య, పడిగం నాగేష్, బడిగం బాలాజీ, పబ్బాల రామకృష్ణ, బూత్ అధ్యక్షులు తమ్మలి రవి, కల్మకల్ల లింగం, గొడుగు శ్రీనివాస్, దర్శనాల సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు పై సీబీఐ దిష్టిబొమ్మ దగ్దం

Satyam NEWS

వైభవంగా ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం

Satyam NEWS

మద్యంపై మళ్లీ మారనున్న జగన్ ప్రభుత్వం పాలసీ?

Satyam NEWS

Leave a Comment