కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతుదని, కాంగ్రెస్, బిజెపి లు అమలుకాని మోసపూరిత హామీలను నమ్మొద్దని ఉప్పల్ టిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. సోమవారం ఏఎస్ రావు నగర్ డివిజన్ బృందావన్ కాలనీ లో బండారి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బండారు లక్ష్మారెడ్డికి బృందావన కాలనీ ప్రజలు మంగళ హారతులతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బిజెపి పార్టీలు మోసపూరిత హామీలు తో తెలంగాణను ఆగం చేసే ప్రయత్నం చేస్తున్నారనీ వారి మాయమాటలు నమ్మొద్దు అంటూ తెలిపారు. బృందావన్ కాలనీ అధ్యక్షులు సీతారాంరెడ్డి మాట్లాడుతూ పేద ప్రజలకు నిత్యం సేవ చేసే బండారి లక్ష్మారెడ్డి లాంటి ప్రజా సేవకుడు ఉప్పల్ నియోజకవర్గానికి అవసరమని తెలిపారు. బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపిస్తామని తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
అభివృద్ధి చేసే బిఆర్ఎస్ పార్టీకే పట్టం కడతామనీ, బిఆర్ఎస్ ప్రభుత్వంతోనే పేదలకు న్యాయం జరుగుతుందని ఏఎస్ రావు నగర్ డివిజన్ పల్లె పేరడైజ్ కాలనీ ప్రెసిడెంట్ ధన్ సాగర్ రెడ్డి అన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారు లక్ష్మారెడ్డికి కారు గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని సంపూర్ణ మద్దతు తెలిపారు.
కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ ప్రెసిడెంట్ కాసం మైపాల్ రెడ్డి, సాయి రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, మల్లారెడ్డి, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా