గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్థసారథి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. GHMC ఎన్నికలకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. హైదరాబాద్ లో నివసించాలని దేశవ్యాప్త ప్రజలు కోరుకుంటారు. నాలుగు కేటగిరీలుగా ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. * డీలిమిటేషన్ ఈ ఎన్నికలకు లేదు..రిజర్వేషన్లు 2016 వే కంటిన్యూ అవుతున్నాయి. 150 వార్డులకు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లిస్ట్ ద్వారా మ్యాపింగ్ చేసామన్నారు. అన్ని రాజకీయ పార్టీలతో భేటీ అయ్యాకే తుది ఓటర్లను విడుదల చేసాం. ఎన్నికల బందోబస్తుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. 150 వార్డుల్లో కౌంటింగ్ కేంద్రాలు- స్ట్రాంగ్ రూమ్స్ ఉంటాయి.
బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు
జీహెచ్ఎంసీ ఎన్నికలు బ్యాలెట్ బాక్స్ ద్వారానే ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. తెల్లకాగితం ద్వారా పేపర్ ఉంటుందన్నారు. ఈసారి మేయర్ స్థానం మహిళ జనరల్గా ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్ స్టేషన్స్ పై 21నవంబర్ నాడు విడుదల చేస్తారు.
రేపటి నుంచే నామినేషన్ ప్రక్రియ మొదలు
రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు పెడతామని కమిషనర్ పేర్కొన్నారు. 18, 19, 20వ తేదీ వరకు నామినేషన్ చివరి ప్రక్రియ కొనసాగుతుంది. 21వ తేదీన నామినేషన్ స్కూటీని, 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు. 22వ తేదీన మధ్యాహ్నం మూడు గంటల తరువాత అభ్యర్థుల ప్రకటన- గుర్తులు కేటాయిస్తామన్నారు.
డిసెంబర్ 1న పోలింగ్
డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ పోలింగ్ ఉదయం 7గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు పోలింగ్ సమయం కొనసాగుతుందన్నారు. ఎక్కడైనా లోపాలు, సమస్యలు తలెత్తితే ఆయా ప్రాంతాల్లో రిపోలింగ్ 3వతేదీన నిర్వహిస్తామని పేర్కొన్నారు. కౌంటింగ్ 4వ తేదీన నిర్వహిస్తామని తెలిపారు. కౌంటింగ్ సమయం ఉదయం 7గంటల నుంచి మొదలవుతుందన్నారు. 4వ తేదీ డిసెంబర్ సాయంత్రం వరకు ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 2500, ఇతరులకు 5000 రూపాయలు డిపాజిట్ చేయాలన్నారు. నామినేషన్ ప్రక్రియలో ఫామ్ వెరిఫికేషన్ ఆన్లైన్ లో చూసుకోవచ్చన్నారు. కరోనా వల్ల 1+3 పోలింగ్ parsonals ఉంటారు!. 48వేల మందితో జీహెచ్ఎంసీ ఎన్నికల నిర్వహణ ఉంటుంది. 9238 మొత్తం పోలింగ్ స్టేషన్స్ డ్రాఫ్ట్ నోటిఫికేషన్ లో ఉండేవి. 21వ తేదీ నవంబర్ నాడు ఫైనల్ చేస్తాం. 1439 సెంటిస్టివ్, హైపర్ సెంటిటివ్ 1004, క్రిటికల్ 257, మొత్తం 27వందల పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి.
కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
913 సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలను ఇప్పటికే గుర్తించామని ఎవరైనా ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు. ఫలితాలు విడుదల అయిన తరువాత 45 రోజుల్లో ఎన్నికల ఖర్చును చూపించాలి. అప్పటిలోగా నిర్లక్ష్యం వహిస్తే 3సంవత్సరాలు డిస్ క్వాలిఫై (ఎలాంటి ఎన్నికల్లో పాల్గొనకుండా తొలగించడం) చేస్తామన్నారు.
ఎన్నికల పర్యవేక్షణలో ఐఏఎస్లు
జనరల్ పర్యవేక్షణ కోసం ఒక్కో జోన్ కు IAS అధికారి మొత్తం ఆరుగురు నియమిస్తాం. ప్రతి పోలింగ్ స్టేషన్ కి ఇద్దరు పోలీసులు బందోబస్తు. 25వేలనుంచి 30వేల మంది పోలీసుల బందోబస్తు. ఎన్నికల నిర్వహణ కోసం అక్కడక్కడా చెక్ పోస్ట్ ల ఏర్పాటు. 356 రూట్ మొబైల్ పార్టిస్, 131 స్ట్రైకింగ్ పోర్స్, 44 స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ బందోబస్తు.
పోలింగ్ కు 48 గంటల ముందు మద్యం బ్యాన్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ అందిస్తారు!. ఓటర్ స్లిప్ వెబ్సైట్-మొబైల్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. 2009 జీహెచ్ఎంసీ 42.04శాతం, 2016లో 45.29శాతం ఓటింగ్ నమోదైంది. కరోనా నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించనున్నారు. నామినేషన్ ప్రక్రియలో ఎంతమంది రావాలో నిబంధల్లో తెలిపామన్నారు.