ఆర్ధికంగా దివాలా తీసిన శ్రీలంకలో అత్యవసర పరిస్థితిని విధిస్తూ ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిర్ణయం తీసుకున్నారు.
నేటి నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్ జారీ చేశారు.
శ్రీలంకలో పెరిగిన ధరలకు వ్యతిరేకంగా ప్రజల ఆందోళన చేపడుతున్న నేపథ్యంలో రాజపక్స ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్థిక సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలు.. ఆ దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేపట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది.
శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు.
దీంతో కొలంబోలోని పలు ప్రాంతాల్లో పోలీసులు కర్ఫ్యూ విధించారు.
previous post