27.7 C
Hyderabad
May 11, 2024 10: 46 AM
Slider విజయనగరం

విజయనగరం జిల్లా స్థాయ ఉద్యోగుల క్రీడా పోటీల‌ల్లో..పౌర సంబంధాల స‌మాచార శాఖ

#informationdepartment

కంటింజెంట్ క‌మాండెంట్ గా వ్య‌వ‌హ‌రించిన‌ స‌మాచార శాఖ ఏడీ

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్టేడియంలో జిల్లాలో అధికారులు, ఉద్యోగ‌స్తులు ప‌లు క్రీడ‌ల‌లో పాల్గొన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ ఆదేశాల‌తో జిల్లా స్పోర్ట్స్ డ‌వ‌ల‌ప్ మెంట్ అధారిటీ శాఖ అధికారి  వెంక‌టేశ్వ‌ర‌రావు ఆధ్వ‌ర్యంలో రాజీవ్ క్రీడా మైదానంలో  రెండు రోజుల పాటు జ‌రుగుతున్న క్రీడ‌ల‌ను స్థానిక ఎమ్మెల్యే వీర‌భ‌ద్ర‌స్వామి, జిల్లాప‌రిష‌త్ చైర్మ‌న్ మ‌జ్జిశ్రీనివాస‌రావులు  ప్రారంభించారు. ఈ సంద‌ర్బంగా అన్ని శాఖ‌లు…కంటింజెంట్ లు గాఏర్ప‌డి…రాజీవ్ క్రీడామైదానంలో మార్చ్ ఫాస్ట్ నిర్వ‌హంచారు.

వ్య‌వ‌సాయ‌,సాంఘిక‌,రెవిన్యూ, ఉద్యాన‌వనం,స‌హ‌కార శాఖ‌….ఇలా ఆఖ‌రున పౌర‌సంబంధాల స‌మాచార శాఖ ఏడీ ర‌మేష్ ఆధ్వర్యంలో  శాఖ ఉద్యోగ‌స్దులంద‌రూ పాల్గొన్నారు. అడిష‌న‌ల్ పీఆర్ఓలు జాన‌కి, వాసు,నారాయ‌ణ‌ల‌తో పాటు ఉద్యోగ‌స్తులు స‌త్య‌నారాయ‌ణ‌,  ఫోటో గ్రాఫ‌ర్ వెంక‌ట్,ముర‌ళీ, నాయుడులు ఈ మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన్నారు. ప్ర‌త్యేకించి డీఎస్డీఓ్..టీ ష‌ర్ట్ ల‌ను పంపిణీ చేయ‌డంతో…దాన్ని వేసుకున్నారు…అధికారులు, ఇతర ఉద్యోగ‌స్తులు. మార్చ్ ఫా్స్ట్ అనంత‌రం..అంద‌రిచే ప్ర‌తిజ్ఙ చేయించారు.

అయితే ఈ మార్చ్ ఫాస్ట్ లోనూ… ఈ అధికారులు,ఉద్యోగ‌స్తులు క్రీడ‌ల‌లో పాల్గొన‌డంలో పౌర‌సంబంధాల‌,స‌మాచార శాఖ అద‌న‌పు సంచాల‌కులు  తోపాటు…శాఖా సిబ్బంది చాలా హుషారుగా పాల్గొన్నారు. మాడు ప‌గిలే ఎండ కాస్తున్న‌ప్ప‌టికీ.. ఉద్యోగులంతా..ఎక్క‌డాసొమ్మ‌సిల్లిపోకుండా..ఉత్సాహంగా హుషారుగా మార్చ్ ఫాస్ట్ లో పాల్గొన‌డం విశేషం.

Related posts

ఆర్భాటంగా టీడీపీ కార్యాలయం ప్రారంభం….

Satyam NEWS

వంగర, లక్నేపల్లి టూరిజం సర్క్యూట్ అభివృద్ధి

Satyam NEWS

వాహనాల నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment