28.7 C
Hyderabad
May 6, 2024 02: 30 AM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో మాదిగ వాడలో పల్లెనిద్ర

#pallenidra

మాదిగ వాడలో పల్లెనిద్ర  కార్యక్రమం ద్వారా మాదిగల సమస్యలు తెలుసుకొని ప్రభుత్వానికి తెలియచేసేందుకు ఏర్పాట్లు చేశామని తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు మీసాల రాము మాదిగ తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం,  మాచినేని పల్లి గ్రామంలో పల్లెనిద్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాదిగ ప్రజల సమస్యలను మీసాల రాము అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ దండోరా జేఏసీ మాదిగల పక్షాన నిరంతరంగా పోరాటం చేస్తుందని ఆయన అన్నారు. మాచినేని పల్లి గ్రామ ప్రజలను ఉద్దేశించి డి కె మాదిగ మాట్లాడుతూ పారంపొగు, అసైన్మెంట్, మారి  వివిధ  విషయాలను తెలంగాణ దండోరా సంఘం దృష్టికి తీసుకురావడం జరిగిందని అన్నారు. వారి డిమాండ్ ను ప్రభుత్వ దృష్టికి,  కొల్లాపూర్ శాసనసభ్యులు బీరం హర్షవర్ధన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగే వరకు  పోరాటం చేస్తామని తెలంగాణ దండోరా నాయకులు అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా రాష్ట్ర కార్యదర్శి, నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ కల్మురి రాములు మాదిగ, నాగర్ కర్నూలు జిల్లా గౌరవ అధ్యక్షులు దేవని కుమార్ మాదిగ, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఇన్ చార్జీ మంతటి గోపి మాదిగ, కొల్లాపూర్ తాలూక  అధ్యక్షుడు మల్లెల వెంకటస్వామి మాదిగ, నాయకులు శివ మాదిగ, మాచినేని పల్లి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఫిట్ ఇండియా రన్

Satyam NEWS

బాబు మనిషికి కీలక పోస్టింగ్

Satyam NEWS

చంద్రబాబుకు హాని జరిగితే మా పార్టీని ప్రజలు తగలెట్టేస్తారు

Satyam NEWS

Leave a Comment