తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రధసారధి నల్గొండ ఎంపీ. కెప్టెన్ N. ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజుర్ నగర్ పట్టణంలోని పారిశుధ్య కార్మికులకు నేడు నిత్యావసర వస్తువులు అందచేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ ఆశా వర్కర్స్ కి ,ఆటో యూనియన్స్ హమాలీలకు కూడా ఆయన నిత్యా వసరాల సరుకులను అందచేశారు. బియ్యం, కూరగాయలు, సబ్బులు, ఆయిల్ ప్యాకెట్ లనుఆయన ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్న సమస్య కరోనా కాబట్టి అందరూ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించండి ఇంట్లోనే ఉండండి అని పేర్కొన్నారు. అదే విధంగా పారిశుధ్య కార్మికుల గురించి మాట్లాడుతూ మీ సేవలు మరువలేనివని కచ్చితంగా మీ సేవకు ప్రతి ఫలంగా గవర్నమెంట్ తో మాట్లాడి కాంట్రక్టు ఉద్యోగాలను రెగ్యులర్ చేసే విధంగా ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు.