Slider నిజామాబాద్

పీఆర్టీయూ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

Hanumanth shinde 181

బిచ్కుంద మండల కేంద్రంలో పీఆర్టీయూ మండలశాఖ ఆధ్వర్యంలో బియ్యం కూరగాయలు నిత్యావసర సరుకులను నిరుపేద కుటుంబాలకు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ఎమ్మెల్యే హనుమంతు షిండే పాల్గొన్నారు.

ఈ సమావేశంలోహన్మంత్ షిండే మాట్లాడుతూ కరోనా మహమ్మారి భయంకరమైనదని దాని పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నప్పటికీ ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలన్నారు.

ఈ సందర్భంగా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం పట్ల పిఆర్టీయు మండల శాఖను ఆయన అభినందించారు. ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి  మాట్లాడుతూ  ఎవరూ ఇబ్బందులు ఎదుర్కోకూడదని పీఆర్టీయు ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లోనూ నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తుననారని అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు దామోదరరెడ్డి జిల్లా జనరల్ సెక్రెటరీ అల్లాపూర్ కుశాల్, ఎంపిపి అశోక్ పటేల్, మండల పీఆర్టీయూ   అధ్యక్షులు ఇర్షాద్ అలీ  పీఆర్టీయూ సంఘ సభ్యులు చంద్రకాంత్ సంగమేశ్వర్ నయీం చాంద్ పాషా పాల్గొన్నారు.

ఇంకా అభిషేక్ వేద్ భూషన్ జీ అశోక్ రచ్చ శ్రీకాంత్ మాజీ జడ్పీటీసీ సాయిరాం మాజీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు రాజు సొసైటీ చైర్మన్ బాలాజీ నాయకులు నూకల రాజు  మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు  దర్పల్లి అశోక్ సీనియర్ నాయకులు షేక్ పాషా సెట్ బొమ్మల లక్ష్మణ్  లబ్ధిదారుల  కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ప్రజలను నేరుగా కలవాలని నిర్ణయించిన సిఎం జగన్

Satyam NEWS

విజయనగరం రూరల్ పోలీసులకు పట్టుబడ్డ స్టూవర్టుపురం దొంగలు…!

Bhavani

బోల్తా’ …శంకర్: భోళా శంకర్ పై నిష్పక్షపాత సమీక్ష

Bhavani

Leave a Comment