బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్, తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ తదితరులు ఉన్నారు.
ఈటలను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన బిజెపిలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది.
అయిదారు రోజుల్లో ఈటల హుజూరాబాద్ వెళ్లి వచ్చాక బిజెపిలో చేరతారని.. నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈటల రాజేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విషయం తెలిసిందే.