31.7 C
Hyderabad
May 2, 2024 09: 03 AM
Slider ముఖ్యంశాలు

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఈటల భేటీ

#JPNadda

బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో  తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన ఈ సమావేశంలో ఆయనతోపాటు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్‌, తరుణ్‌ చుగ్‌, మాజీ ఎంపీ వివేక్‌ తదితరులు ఉన్నారు.

ఈటలను రాష్ట్రమంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన బిజెపిలో చేరతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ కి ప్రాధాన్యత సంతరించుకుంది.

అయిదారు రోజుల్లో ఈటల హుజూరాబాద్‌ వెళ్లి వచ్చాక బిజెపిలో చేరతారని.. నియోజకవర్గానికి వెళ్లివచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి,  టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.

ఈటల రాజేందర్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత జి.వివేక్ వెంకటస్వామి నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న విష‌యం తెలిసిందే.

Related posts

విధి నిర్వహణలో బాధ్యతగా వ్యవహరించండి

Satyam NEWS

నూతన ఉత్తేజంతో విధులు నిర్వర్తించాలి

Satyam NEWS

బహిరంగ సభకు భారీగా తరలి వెళ్లిన హుజూర్ నగర్ తెలుగు తమ్ముళ్ళు

Satyam NEWS

Leave a Comment