తెలుగుదేశం పార్టీ ఖమ్మం జిల్లా కేంద్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన తెలుగుదేశం పార్టీ బహిరంగ సభకు సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు,నాయకులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. హుజూర్ నగర్ పట్టణంలోని ఇందిరా సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా భారీ ర్యాలీ నిర్వహించారు. సుదీర్ఘకాలం తర్వాత తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు, నేతలు ఉత్సాహ భరితంగా ఖమ్మం నగరం తరలి వెళ్లారు.
భారీ బహిరంగ సభకు తరలి వెళ్ళిన వారిలో తెలుగుదేశం పార్టీ నాయకులు మండవ వెంకటేశ్వర్లు,టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శీతల రోషపతి, మండల పార్టీ అధ్యక్షుడు మాలోత్ నాగు నాయక్,కీసర నాగయ్య ముదిరాజ్, మేకల రామారావు యాదవ్,సైదులు,ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి మీసాల సైదులు,కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొమ్మగాని వెంకటేశ్వర్లు గౌడ్, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఉండేటి సతీష్ ,ఎస్సీ సెల్ నల్గొండ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కస్తాల కనకరత్నం,పార్టీ సీనియర్ నాయకుల వల్లపుదాసు కోటయ్య గౌడ్ , బంటు రాములు, జుట్టుకొండ సోమయ్య, సైదిరెడ్డి,జానపాటి కొల్లయ్య,నాగరాజు, బత్తిని లక్ష్మయ్య,మండవ శేషయ్య,పెండెం అంజయ్య గౌడ్,తెలుగుదేశం పార్టీ అభిమానులు తదితరులు ఉన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్