27.7 C
Hyderabad
April 30, 2024 08: 08 AM
Slider చిత్తూరు

అమ్మాయిలను ఏడిపించిన వారిని వదిలేది లేదు

madanapally

చిత్తూరు జిల్లాలో మరో ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. బి.కొత్తకోట గట్టు లో తొమ్మిది తరగతి విద్యార్థిని పట్ల కొందరు యువకులు అసభ్య ప్రవర్తన చేయడంతో ఆ యువకులను గ్రామస్థులు చితకబాదారు. గతంలో కూడా ఈ యువకులు అమ్మాయిలను వేదిస్తుంటే మందలించి గ్రామస్థులు వదిలేశారు.

ఈ సారి కూడా మళ్లీ దొరకడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులు తీసుకువెళతామన్నా ఇవ్వలేదు. వారిని పోలీసులు మదనపల్లె రూరల్ స్టేషన్ కు తరలిస్తుంటే గ్రామస్థులు అడ్డుకున్నారు. చివరికి యువకులను బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువచ్చారు.

ఆ యువకులను తమకు అప్పగించాలని భీష్మించుకుని స్టేషన్ ఎదుట గ్రామస్థులు ఆందోళన చేశారు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా చివరకు యువకులను మదనపల్లె స్టేషన్ కు పోలీసులు తరలించారు.

Related posts

వైసీపీ లీడర్ కూతురు కోసం పేద మెరిట్ ముస్లిం విద్యార్ధిని బలి

Satyam NEWS

కరోనాతో మాజీ క్రికెటర్‌ చేతన్ చౌహాన్‌ కన్నుమూత

Satyam NEWS

సమాచార హక్కు చట్టంపై అవగాహన వుండాలి

Murali Krishna

Leave a Comment