చిత్తూరు జిల్లాలో మరో ఆసక్తి కరమైన సంఘటన జరిగింది. బి.కొత్తకోట గట్టు లో తొమ్మిది తరగతి విద్యార్థిని పట్ల కొందరు యువకులు అసభ్య ప్రవర్తన చేయడంతో ఆ యువకులను గ్రామస్థులు చితకబాదారు. గతంలో కూడా ఈ యువకులు అమ్మాయిలను వేదిస్తుంటే మందలించి గ్రామస్థులు వదిలేశారు.
ఈ సారి కూడా మళ్లీ దొరకడంతో గ్రామస్థులు వారిని పట్టుకుని పోలీసులు తీసుకువెళతామన్నా ఇవ్వలేదు. వారిని పోలీసులు మదనపల్లె రూరల్ స్టేషన్ కు తరలిస్తుంటే గ్రామస్థులు అడ్డుకున్నారు. చివరికి యువకులను బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ కు పోలీసులు తీసుకువచ్చారు.
ఆ యువకులను తమకు అప్పగించాలని భీష్మించుకుని స్టేషన్ ఎదుట గ్రామస్థులు ఆందోళన చేశారు. కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా చివరకు యువకులను మదనపల్లె స్టేషన్ కు పోలీసులు తరలించారు.