38.2 C
Hyderabad
April 29, 2024 19: 26 PM
Slider మహబూబ్ నగర్

సభ్యత్వ నమోదులో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాల్గొనాలి

#congressparty

నారాయణపేట్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించాలని పీసీసీ కార్యనిర్వహణ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. నేడు మక్తల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ  సభ్యత్వ సమీక్ష సమావేశ కార్యక్రమం నిర్వహించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సమీక్ష సమావేశానికి ముఖ్యతిధిగా హజరైన మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ సభ్యత్వ కార్యక్రమం చేయాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికునిడిలాగా పని చేయాలని కోరారు. ప్రతి ఒక్క ఎన్ రోలర్ వంద కు తగ్గకుండా సభ్యత్వాలు చేయాలని కోరారు.

టీపీసీసీ ఉపాధ్యక్షులు వేం నరేందర్ రెడ్డి, పార్లమెంట్ కో ఆర్డినేటర్ జంగయ్య యాదవ్, మక్తల్ నియోజకవర్గ సభ్యత్వ సమన్వయకర్త రంగినేని అభిలాష్ రావు కార్యక్రమంలో పాల్గొన్నారు. మక్తల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ సమీక్ష సమావేశ కార్యక్రమానికి మాజీ జడ్పీ ప్లోర్ లీడర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాకిటి శ్రీహరి అధ్యక్షత వహించారు.

మక్తల్ నియోజకవర్గ సభ్యత్వ సమన్వయకర్త రంగినేని అభిలాష్ రావు మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పీసీసీ అధ్యక్షులు ఎనుముల రేవంత్ రెడ్డి అదేశానుసారం కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ కార్యక్రమం  రాష్ట్రంలో చాలా వేగవంతంగా సాగుతుందన్నారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రెండు లక్షల బీమా వర్తిస్తుందని సభాముఖంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మక్తల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు ప్రశాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండలాల అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎన్ రొలర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.

Related posts

జ‌ర్న‌లిస్టుపై ఎమ్మెల్యే ప్ర‌వ‌ర్త‌న‌పై నిర‌స‌న ర్యాలీ

Sub Editor

అక్టోబ‌రు 8న రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

Satyam NEWS

బ్రేకింగ్ న్యూస్: మంత్రి కేటీఆర్ కు గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసు

Satyam NEWS

Leave a Comment