25.7 C
Hyderabad
May 9, 2024 09: 27 AM
Slider ఆధ్యాత్మికం

దేవాలయంలో పని చేస్తున్న కుటంబాలకు ఆర్ధిక సాయం

#templestaff

దేవాలయంలో పని చేస్తున్న మూడు కుటుంబాలను గుంటూరు జిల్లా నరసరావుపేట మెడికల్ అసోసియేషన్ ఆదుకున్నది. నరసరావుపేట పాతూరు భీమ లింగేశ్వర స్వామి వారి దేవాలయం లో పని చేస్తున్న రెండు పేద కుటుంబాలకు, ఒక బ్రాహ్మణ కుటుంబానికి శ్రీ శారదా స్మార్త పురోహిత సంఘం ఆధ్వర్యంలో నరసరావుపేట మెడికల్ అసోసియేషన్ అధ్యక్షుడు మునగా వేణు మాధవ్, కొనకండ్ల సురేంద్ర బాబు ఆర్థిక సహకారం అందించారు.

నెల  రోజులకు సరిపడ 3500 రూపాయల విలువ గల నిత్యావసర సరుకులు అందించారు. ఈ కార్యక్రమం లో కోట ప్రసాదు, మహేశ్వరభొట్ల దుర్గా ప్రసాద్, కోట సుబ్రహ్మణ్యం,  మహేశ్వరభొట్ల శ్రీనివాస శర్మ, పాలపర్తి సుధీర్, పోతుకూచి గోపీ,  చతుర్వేదుల భ్రమర్ నాధ్, కూచిభోట్ల విశ్వనాథ, చెరువు మురళీ, కోట కృష్ణ, రాణీ రామకృష్ణ, రాణీ చైతన్య చింతలపల్లి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. ఆర్థిక సహకారం అందించిన మునగా వేణు మాధవ్, కొడకండ్ల సురేంద్ర బాబులకు శ్రీ శారదా స్మార్త పురోహిత సంఘం ధన్యవాదాలు తెలిపింది.

Related posts

కాపు కులస్తుల్లో ఐక్యత ఎంతో అవసరం : బోలిశెట్టి శ్రీనివాసులు

Satyam NEWS

అధికారులు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలి

Satyam NEWS

బీసీల నెత్తుటితో తడుస్తున్న మాచర్ల నేల..!

Satyam NEWS

Leave a Comment