35.2 C
Hyderabad
May 9, 2024 17: 38 PM
Slider ముఖ్యంశాలు

Phone Taping: సర్వీస్ ప్రొవైడర్ లకు నోటీసులు జారీ

#APHighCourt

న్యాయమూర్తులు ఫోన్ ట్యాపింగ్ జరిగింది అంటూ ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన కధనం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తరువాత అధికార పార్టీ ఎంపీ కె. రఘురామకృష్ణంరాజు తన ఫోన్ కూడా ట్యాప్ అవుతుంది అని చెప్పటం, అలాగే చంద్రబాబు, ప్రధానికి లేఖ రాయటం, హైకోర్టులో పిల్ దాఖలు కావటంతో, ఈ మొత్తం వ్యవహారం పై చర్చ జరుగుతుంది.

ఈ నేపధ్యంలో, శ్రవణ్ కుమార్ వేసిన పిల్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా, ఇరు పక్షాల నుంచి హోరా హరీ వాదనలు జరిగాయి. చీఫ్ జస్టిస్ మహేశ్వరీ నేతృత్వంలోనే బెంచ్ ఈ వాదనలు విన్నది. ఈ అంశం పై దాదాపుగా 45 నిమిషాల సేపు వాదనలు జరిగాయి.

అయితే ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తూ, ఆంధ్రజ్యోతిని కూడా పార్టీగా చేర్చాలని వాదించారు. దీని పై స్పందించిన ధర్మాసనం, ఆ కధనం చదివి వినిపించమని కోరింది. ఆంధ్రజ్యోతి కధనం పై ఫోన్ ట్యాపింగ్ కు విచారణకు ఆదేశిస్తే, మీకు వచ్చిన అభ్యంతరం ఏమిటి అంటూ కోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించినట్టు, పిటీషనర్ శ్రవణ్ కుమార్ మీడియాకు తెలిపారు.

 ఆంధ్రజ్యోతి కధనంలో ఏమైనా తప్పు ఉంటే, మీరు తగు చర్యలు తీసుకోవచ్చు అని, మేము కూడా ఈ విచారణలో ఏమైనా తప్పు ఉంటే, చూస్తాం అని ధర్మాసనం చెప్పినట్టు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక పెద్ద నేరం అని, రాజ్యాంగంలో కూడా ఇది ఉందని, ఇద్దరి వ్యక్తుల మధ్య మాట్లాడే విషయం, వినే హక్కు ఎవరికీ లేదని తెలిపారు.

 అయితే ఫోన్ ట్యాపింగ్ కోసం ఒక అధికారిని ప్రభుత్వం నియమించింది అంటూ, న్యాయవాది శ్రవణ్ కోర్టుకు తెలిపారు. ఆ అధికారి పేరు చెప్పాలని కోర్టు కోరగా, ఓపెన్ కోర్టు లో చెప్పలేను అని, అఫిడవిట్ రూపంలో దాఖలు చేస్తానని చెప్పారు.

అలాగే న్యాయమూర్తుల పై, షాడో పార్టీలను నియమించింది అంటూ, శ్రవణ్ కోర్టుకు తెలపటంతో, దాంట్లో ఉన్న ఆధారాలు అఫిడవిట్ రూపంలో తమకు చెప్పాలని కోర్టు తెలిపింది. 5 గురు ఫోనులు ట్యాప్ అయ్యాయి అని శ్రవణ్ చెప్పటంతో, దీని పై విచారణకు ఆదేశిస్తే మీకు అభ్యంతరం ఏమిటి అని కోరగా, తమకు అభ్యంతరం లేదని ప్రభుత్వం చెప్పటంతో, గురువారంలోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చెయ్యాలని కోరింది.

ఈ కేసు విచారణ గురువారానికి వాయిదా వేసింది. దీంతో పాటు, సర్వీస్ ప్రొవైడర్ లకు కూడా నోటీసులు ఇవ్వాలని కోరింది.

Related posts

మోడల్ స్కూల్ టీచర్ల బదిలీలకు గ్రీన్ సిగ్నల్

Bhavani

పదవ తరగతి విద్యార్థులకు హాల్ టిక్కెట్లు పంపిణీ

Satyam NEWS

కల్వకుర్తి సమస్యల మీద కాలు దువ్వుతున్న యువజన కాంగ్రెస్

Satyam NEWS

Leave a Comment