కొల్లాపూర్ సర్కిల్ పరిధిలోని కోడేరు మండలంలో కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు,నాగర్ కర్నూల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మండల పరిధిలోని నాగుల పల్లి తండా, నారాయణ నాయక్ తండాలో సారా తయారి స్థావరాలపై దాడులు చేశారు.
500 బెల్లం పానకాన్ని నేల పాలు చేశారు. 20 లీటర్ల సారా స్వాధీనం చేసుకొని,70 కేజీల బెల్లాన్ని సీజ్ చేశారు. ఇద్దరి పై కేసులు నమోదు చేసి, ఇద్దరిని అరెస్టు చేసినట్లు కొల్లాపూర్ ఎక్సైజ్ సీఐ ఏడుకొండలు తెలియజేశారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సిబ్బంది, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు పాల్గొన్నారు.