29.7 C
Hyderabad
May 3, 2024 03: 21 AM
Slider పశ్చిమగోదావరి

రైతు రుణాలు సకాలంలో చెల్లిస్తే రాయితీలు

#pedavegimandal

రైతులు రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే రాయితీలను పొందాలని పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి సొసైటీ చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు అన్నారు.

చైర్ పర్సన్ సుబ్బారావు అధ్యక్షతన గురువారం సొసైటీ సర్వసభ్య సమావేశం జరిగింది. సొసైటీ టర్నోవర్ 11 కోట్లు కాగా  దానిని 22 కోట్ల  టర్నోవర్  గా పెంచినట్టు చెప్పారు. దెందులూరు ఎం ఎల్ ఏ కోటారు అబ్బయ్య చౌదరి ఆదేశాలతో సొసైటీ 3.50 కోట్లు కోవిడ్ రుణాలు అందించామని చెప్పారు. అదే విధంగా 76 శాతం రుణాల రికవరీ చేశామన్నారు. 

రెండేళ్లుగా మొక్కజొన్న, ప్యాడి ఖరీఫ్, రబి పంటల ద్వారా చేసిన వ్యాపారంపై 35 లక్షల కమిషన్ రావాల్సి ఉంది తెలిపారు. ఇప్పటి వరకు సొసైటీ సభ్యులు 2వేల మంది ఉన్నారని ఈ ఏడాది మరో 800 మంది కొత్త సభ్యులను చేర్చున్నామన్నారు.

ఈ ఏడాది సొసైటీ ద్వారా ట్రాక్టర్ రుణాలు ఇవ్వనున్నామని ఈ రుణాలపై లక్ష రూపాయలు సబ్సిడీ అందిస్తున్నట్టు చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు చెప్పారు. సొసైటీ పరిధిలో ఉన్న 7 పంచాయతీలున్నాయని ఒక్కో పంచాయతీకి 3 పాడిగేదెలు చొప్పున 7 పంచాయతీలకు 21 పాడి గేదెలు పంపిణీ పంపిణీ  చేశామని తెలిపారు.

ఈ సమావేశానికి పెదవేగి మండల పరిషత్ అధ్యక్షురాలు తా తా రమ్య ముఖ్య అతిధిగా, దెందులూరు నియోజకవర్గ స్థాయి వై సి పి నాయకులు  మేడికొండ వెంకట కృష్ణారావు విశిష్ట అతిధిలుగా హాజరయ్యారు. ఈ సందర్భం గా చైర్ పర్సన్ పెనుమాక వెంకట సుబ్బారావు మాట్లాడుతూ పెదవేగి సొసైటీ ద్వారా రుణాలు పొందిన రైతులు ఎటువంటి వత్తిడి లేకుండా రుణాలు చెల్లించాలని తెలిపారు.

వ్యవసాయ పంటల రుణాలు రైతులకు సకాలంలో అందించేందుకు పెదవేగి సొసైటీ ముందుంటుందని చెప్పారు. రుణాలు అందించడంలో సొసైటీ తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించడంలో రైతులు పోటీపడుతుండడం ఆనందంగా ఉందన్నారు.

ఈ సమావేశంలో ఎం పి పి తా తా రమ్య మాట్లాడుతూ సొసైటీ  రైతుల అభివృద్ధికి మరింత కృషిచేయాలని సూచించారు. ముందుగా సొసైటీ కార్యదర్శి తిప్పాబట్ల శ్రీరామూర్తి సొసైటీ ప్రగతి నివేదిక సభ్యులకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వై సిపి నాయకులు పెదవేగి మాజీ సర్పంచ్ తా తా సత్యనారాయణ సొసైటీ పర్సన్ ఇన్ ఛార్జ్ లు మేకా వసంత్ కొనకళ్ల రాజ్యలక్ష్మి రైతులు పాల్గొన్నారు.

Related posts

నిరుపేదలకు సాయం చేస్తామంటున్న యువకులు

Satyam NEWS

ఆల‌యాల భూములు కబ్జా చేస్తే క్రిమిన‌ల్ కేసులు

Satyam NEWS

పోలవరం ఆగుతుందని నేను ముందే చెప్పాను

Satyam NEWS

Leave a Comment