ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. ఆదిలాబాద్ జిల్లా గుడి హత్నూర్ మేకలదండి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాదంలో మరో ఐదుగురికి గాయాలు అయినట్లు తెలిసింది. క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.