శ్రీసత్యసాయిజిల్లా
మడకశిర మండలంలోని కల్లుమర్రి చెరువులో మత్స్యకారులకు అరుదైన తాబేలు చిక్కింది. గ్రామానికి చెందిన కొందరు యువకులు చెరువులో వల వేయగా చేపలతోపాటు తాబేలు పడింది. ఆ తాబేలు బంగారు రంగులో ఉంది. దానిని చూసి మత్స్యకారులు ఆశ్చర్యపోయారు.
ఆ తాబేలు పలువురు పూజలు చేశారు. ఏదైనా దేవస్థానానికి సంబంధించిన కోనేరులో ఆ తాబేలును వదలాలని మత్స్యకారులు నిర్ణయించుకున్నారు