క్రషర్ మిషన్లో పనిచేసేందుకు మదనంతాపూర్ తండా నుండి కూలీలు ఆటోలో వస్తుండగా వికారాబాద్ జిల్లాలో ధరూరు మండలం కెరెల్లి రైతు వేదిక సమీపంలో ఆటోను లారీ ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తో సహా ఇద్దరు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనికి తోడు సమయానికి అంబులెన్స్ రాకపోవడంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించేందుకు స్థానికులు చేయని ప్రయత్నం అంటూ లేదు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం ఆనీ స్థానికులు చెబుతున్నారు.
previous post