31.2 C
Hyderabad
May 3, 2024 01: 59 AM
Slider గుంటూరు

రోజూ వేధిస్తున్న కొడుకును చంపేసిన తండ్రి

#Crime Scene

గుంటూరు జిల్లా నకరికల్లు మండల కేంద్రమైన నకరికల్లు లో మద్యానికి బానిసైన కుమారుడిని ఒక తండ్రి హతమార్చాడు. కొనతం తిమ్మారెడ్డి మద్యం మత్తులో రోజు తల్లిదండ్రులను హింసించేవాడు.

మద్యానికి బానిసై డబ్బులు ఇవ్వాలని వేధిస్తూ తల్లిదండ్రులకు నరకయాతన చూపించేవాడు. వివాహితుడైన ఇతను కొంతకాలంగా అత్తగారింట్లో ఉంటున్నాడని తెలియవచ్చింది.

మద్యానికి డబ్బులు ఇవ్వాలని వచ్చి తండ్రి దగ్గర వాగ్వాదానికి దిగిన సమయంలో తండ్రి కొనతం మల్లారెడ్డి అతని వెనక తలభాగం మీద కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై మరణించాడు.

విషయం తెలుసుకున్న నకరికల్లు మండల ఎస్సై ఉదయ బాబు.. సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జండా ఎగరడం ఖాయం

Satyam NEWS

ప్రభల నిర్మాణానికి డా౹౹చదలవాడ ఆర్ధిక సహాయం

Satyam NEWS

మహిళా దినోత్సవం రోజున లేడీ ఎస్పీకి డీఐజీ గా పదోన్నతి

Satyam NEWS

Leave a Comment