తెలంగాణ రాష్ట్రంలో బిజెపిని విజయపథంలో నడిపిస్తున్న రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ ను కొమరం బీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గ ఇన్ చార్జి డా కొత్తపల్లి శ్రీనివాస్ నేడు సన్మానించారు.
తనను రెండో సారి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గా నియమించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా వెనుకబడిన పూర్వపు ఆదిలాబాద్ జిల్లాలోని తమ ప్రాంతం ఎదుర్కొంటున్న సమస్యలను బిజెపి రాష్ట్ర అధ్యక్షుడికి డా కొత్తపల్లి శ్రీనివాస్ వివరించారు.
తమ ప్రాంత సమస్యల సాధనకు సాయం చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. అరె కులస్తులకు ఓబీసీ హోదా ఇచ్చే విషయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని, బెంగాలీలకు ఎస్ సి హోదా ఇచ్చేందుకు ప్రయత్నించాలని కూడా డా కొత్తపల్లి శ్రీనివాస్ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడిని కోరారు.
అదే విధంగా ఢిల్లీ లోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయములో సభ్యుడు తల్లోజు ఆచారిని కూడా డా కొత్తపల్లి శ్రీనివాస్ కలిశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు పులగం నారాయణ, రాంనాగర్ mptc బికాస్ గరామి కూడా పాల్గొన్నారు.