అఖిల భారత మిడ్డే మిల్స్ వర్కర్స్ ఫెడరేషన్ 2వ జాతీయ మహాసభ లను జయప్రదం చేయాలని సి ఐ టి యు కామారెడ్డి జిల్లా కమిటి సభ్యుడు సురేష్ గొండ పిలుపునిచ్చారు. మధ్యాహ్న భోజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో వచ్చే నేల 4,5తేదీలలో తెలంగాణ రాష్ట్ర రాజధాని నగరం హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో జరిగే 2వ జాతీయ మహాసభ లను జయప్రదం చెయ్యాలని సి ఐ టి యు జిల్లా కామిటి సభ్యుడు సురేష్ గొండ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాన్ని జుక్కల్ మండల కేంద్రం లో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతు ఈ మహాసభ లో వేతనాల పెంపు, మధ్యాహ్న భోజనం పథకం బలోపేతం కు కార్యాచరణ కు రూపకల్పన చెయ్యబోతున్నారని దేశ నలుమూలల నుండి వందలది మంది ప్రతినిధులు హాజరువుతున్నారని ఆయన పేర్కొన్నారు.
ఈ మహాసభ ల నిర్వహణ కు వివిధ రంగాల్లోని ప్రముఖులు, అభ్యుదయ మేధావులు, కార్మికఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నేతలతో జరిపే ఈ మహాసభ లకు జుక్కల్ నియోజకవర్గం నుండి అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చెయ్యాలని కోరారు. ప్రభుత్వ పాఠశాల కు నాణ్యమైన ఆహారం, మౌలిక వసతులకల్పన, కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి తగిన పరిష్కారలను ప్రభుత్వ దృష్టికి తెచ్చేందుకు ఈ మహాసభ లు నిర్వహిస్తున్నాట్లు పేర్కొన్నారు.కార్యక్రమంలో c ఐ టి యు నాయకులు ఆడేప్ప, శ్రీనివాస్, నర్సింలు, పండరి, గంగామణి, లలిత, పద్మిని బాయి, రామ్ బాయి, విరితో పాటు మండలం లోని అన్ని పాఠశాలల మధ్యాహ్నభోజన కార్మికులు పాల్గొన్నారు.
జి లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం